పునీత్ మరణం వల్ల రూ.400 కోట్లు నష్టం..!!

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సడన్ గా మరణించడంతో చాలా మందికి ఆ బాధను మిగిల్చింది. ఈయన మరణించడంతో పునీత్ ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టు విలువ దాదాపు 400 కోట్ల రూపాయలకు నష్టం వాటిల్లుతుందట. పునీత్ ఒక్కో సినిమాకి దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరుగుతుందట. ఇప్పుడు ఆయన మరణించడంతో పునీత్ చేస్తున్న జేమ్స్, ద్విత్వ అనే రెండు సినిమాలు ఆగిపోయాయి.

ఈ రెండు సినిమాలు దాదాపుగా 120 కోట్ల వరకు బడ్జెట్ తో తెరకెక్కనున్ననాయి. అయితే ఈ సినిమా దర్శక నిర్మాతల పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఇక పునీత్ కూడా తన సొంత నిర్మాణ బ్యానర్లోనే కొన్ని సినిమాలను ప్లాన్ చేస్తున్నారట. ఈయన బ్యానర్లో 5 సినిమాలలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఆవి కూడా దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా తెరకెక్కిస్తున్నట్లు గా సమాచారం.

అయితే ఇప్పుడు వీటన్నిటిని కలుపుకుంటే నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా జరిగే ఈ సినిమాల బిజినెస్ ప్రశ్నార్థకంగా మారింది. అయితే మరి ఈ సినిమాలో పరిస్థితిని ఏం చేస్తారు అనే విషయం ఇంకా తెలియలేదు.