రాజ్ తరుణ్ తీసే సినిమాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయని చెప్పవచ్చు.. తన నటనతో, స్మైల్ తో ఎంతో మంది అమ్మాయిలకు రాకుమారుడిగా మారిపోయాడు. రాజ్ తరుణ్ కిట్టు ఉన్నాడు జాగ్రత్త, కుమారి 21ఎఫ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకొని , ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ పెరిగిపోతున్న నేపథ్యంలో నే మరో డిఫరెంట్ స్టైల్ కలిగిన యంగ్ హీరో తో రెండవసారి మల్టీ స్టారర్ మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
పూర్తీ వివరాల్లోకి వెళ్తే టాలీవుడ్ యంగ్ హీరోలు.. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ ఇద్దరూ డిఫరెంట్ టేస్ట్ కలిగిన హీరోలే. అలాంటి ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే నిజంగా వెరైటీ గా ఉంటుంది.సరిగ్గా ఇదే ఆలోచనతో, నిర్మాత యం.అసిఫ్ జానీ ఈ ఇద్దరితోనూ సినిమా తీయడానికి ముందుకొచ్చినట్టు సమాచారం. కామెడీ ఎంటర్ టైనర్స్ చేయడంలో ఆరితేరిన రాజ్ తరుణ్, ‘జార్జ్ రెడ్డి, వంగవీటి’ లాంటి బయోపిక్స్ లో నటించిన సందీప్ మాధవ్ హీరోలుగా.. త్వరలోనే ఒక సినిమా ప్రారంభం కానుందని టాలీవుడ్ టాక్.
సుధీర్ రాజ్ దర్వకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆయన చెప్పిన కథ హీరోలిద్దరికీ బాగా నచ్చడంతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ తుది దశకి చేరుకుంది. ఇక షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలోనే రాబోతోంది అని సమాచారం.