ఎవరు మీలో కోటీశ్వరులు షో నుంచి తప్పుకున్న ఎన్టీఆర్.. ఏం జరిగింది..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరపై.. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ షోకి టిఆర్పి రేటింగ్ తీసుకురావడానికి ఎన్టీఆర్ సకల ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పాపులారిటీ పడిపోయిన జెమినీ టీవీ ఛానల్లో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీఆర్ ఒక రకంగా ఫెయిల్యూర్ పొందాడనే చెప్పాలి. అందుకు కారణం పెద్దగా జెమినీ టీవీ పాపులర్ ఛానల్ కాకపోవడం, రోజు ఒకే కాన్సెప్ట్ తో వచ్చి, సీన్లను ప్రేక్షకులు తిలకించక పోవడమే కారణమని అని కొంతమంది చెబుతున్నారు.

 

కానీ అసలు విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు సీజన్ వన్ లో 60 ఎపిసోడ్లు ఉండగా.. వాటి షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు సమాచారం. ఈ ఎపిసోడ్ లు నవంబర్ మొదటి వారం వరకు ప్రసారం అవుతాయి. ఎవరు మీ లో కోటీశ్వరులు ఎపిసోడ్లను పూర్తి చేసుకున్నందుకు గాను ఎన్టీఆర్ 7.5 కోట్ల రూపాయలను అందుకున్నాడట. ఇప్పటికే ఈ షోకి రామ్ చరణ్ , సమంత , కొరటాల శివ, రాజమౌళి గెస్ట్లుగా హాజరైన విషయం తెలిసిందే..

 

ఇక వీరి తరువాత మహేష్ బాబు, తమన్నా కూడా ఈ షో కి హాజరు కాబోతున్నారు. ఇకపోతే మహేష్ బాబు అభిమానులు మహేష్ బాబు ఎప్పుడు వస్తారు అని ఎదురు చూస్తున్నారు.. ఇకపోతే ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాను తెరకెక్కించడానికి షూటింగ్ లో పాల్గొన్నబోతున్నాడు.ఇకపోతే ఎన్టీఆర్ రెండవ సీజన్ లో పాల్గొనడం లేదు తెలియాల్సి ఉంది.