భార‌త్‌లో క‌రోనాతో కొత్త‌గా 443 మంది మృతి.. పాజిటివ్ కేసులెన్నంటే.

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్ల‌గా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 14,306 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,89,774 కు చేరుకుంది. అలాగే నిన్న 443 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,54,712 కు పెరిగింది.

అలాగే ప్ర‌స్తుతం 1,67,695 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. ఇక పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా కేర‌ళ రాష్ట్రం నుంచే వ‌స్తున్నాయి. తాజా కేసుల్లోనూ 8,538 కేసులు కేర‌ళ‌లోనే న‌మోదు అయ్యాయి.