బిగ్ బాస్ :లోబో పై ఫైర్ అయిన నాగార్జున?

తాజాగా జరిగిన బిగ్ బాస్ షో ఎపిసోడ్ లో నాగార్జున బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. కూతుళ్ల మీద,వాళ్ళ మీద,వీళ్ళ మీద ఒట్టు వేయడం ఎందుకు అంటూ యాని మాస్టర్ మీద ఫైర్ అయ్యాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో శ్రీరామ్ మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తూ అతనిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు నాగార్జున. యాక్టర్స్ అంటే చిన్న చూపా అంటూ నిలదీశాడు. హౌస్ ప్రాపర్టీ నిర్లక్ష్యం చేయకూడదు అన్న నియమం నీకు తెలియదా? అంటూ లోబోని ప్రశ్నించాడు. రవి చెప్తే అలా చేశానని లోబో సమాధానం ఇవ్వడంతో.. రవి గడ్డి తినమంటే నువ్వు తింటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆ తర్వాత అసలు ఐడియా కి కారణమైన రవి నిలదీశాడు. ఈ నేపథ్యంలో రవి మాట్లాడుతూ. ఫిదా కూడా కుషన్స్ కట్ చేస్తోందన్న విషయం తనకు తెలిసిందని చెబుతుండగా మధ్యలో శ్వేతా రవి ని అడ్డుకుని తాను రవి ఐడియానే ఫాలో అవుతున్నాను అన్న విషయం రవి కూడా తెలుసు అని చెప్పింది. దీంతో నాగార్జున ఇవన్నీ వింటుంటే నట్రాజ్ మాస్టర్ చెప్పింది నిజమే అనిపిస్తోంది అంటూ పరోక్షంగా గుంటనక్క అని పిలిచాడు నాగార్జున . దీనితో రవి సిగ్గుతో తల దించుకున్నారు. ఇక ఆ తర్వాత రవి ఎలా రెస్పాండ్ అవుతాడు? ఈ గొడవ నుంచి ఎలా బయట పడతారో తెలియాలి అంటే? ఎపిసోడ్ వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే మరి.