వరుడు కావలెను సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

హీరో నాగ శౌర్య తాజాగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా వరుడు కావలెను. ఇందులో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా విడుదల తేదీకి ముహూర్తం ఖరారు చేశారు మూవీ మేకర్స్. హీరో నాగ శౌర్య ఈ సినిమా కోసం దసరా ను టార్గెట్ చేశారు. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ తాజాగా ఒక పోస్టర్ను విడుదల చేశారు చిత్ర బృందం. ఇందులో దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను ఓ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది.

ఈ సినిమా రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నదియా, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్నారు. ఈ మధ్యనే వరుడు కావలెను టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.