ఈడీ విచారణకు హాజరైన ఛార్మి.. ఫోటోలు వైరల్?

టాలీవుడ్ హీరోయిన్ చార్మి తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యింది. డ్రగ్స్ సరఫరా చేసే కెల్విన్ తో ఛార్మి వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సమాచారం. అయితే కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ అధికారులు ఛార్మిని కూడా ప్రకటించనున్నారు. 2015 నుంచి 2017 వరకు జరిగిన బ్యాంకు లావాదేవీల వివరాలను వెంటనే తేవాలని ఈడి నోటీసులో పేర్కొంది.

అంతేకాకుండా ఈ ఛార్మి ప్రొడక్షన్ హౌస్ ఆర్థిక లావాదేవీలపై కూడా పని ఉంది. అయితే ఇది వరకు పూరి జగన్నాథ్ తన బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు సమర్పించారు.హీరోయిన్ గా గుడ్ బై చెప్పి దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి కో ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తోంది.

2017 గా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని ఆరోపణలపై ఛార్మి ఎక్సైజ్ విచారణ ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ ఇప్పటికే ఈడీ అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ కెల్విన్ ఇచ్చినా సమాచారంతోనే హీరోయిన్ ఛార్మి తో పాటు ఇంకా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్లు సమాచారం.