స్పృహలోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్.. ఏం మాట్లాడంటే…?

టాలీవుడ్ హీరో సాయి ధరంతేజ్ కు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈయన రోడ్డు ప్రమాదం తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.రోడ్డు ప్రమాదం తర్వాత ఆయనకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించారు.

సాయి ధరమ్ తేజ్ కు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు.ఇక నిన్న రాత్రి సృహ కోల్పోయిన సాయిధరమ్తేజ్ మొట్టమొదటిసారిగా స్పృహలోకి వచ్చినట్లు తెలుస్తోంది. స్పృహలోకి వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులతో కేవలం వీడియో కాలు లో చాలా నొప్పిగా ఉందంటూ ఒకే ఒక మాట మాట్లాడి కట్ చేసినట్లు తెలుస్తోంది.

ఉదయం నుంచి సాయి ధరంతేజ్ అన్ని స్కానింగ్లు చేయగా ఎటువంటి ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఆదివారం బోన్ సర్జరీ చేయనున్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు.రోడ్డు ప్రమాదం అనంతరం సాయి ధరంతేజ్ ఎక్కడినుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.సాయి ధరమ్ తేజ్తో పాటు నరేష్ కుమారుడు నవీన్ మరొక ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక చోటికి వెళ్లనున్నట్లు గా సమాచారంhttps://m.facebook.com/story.php?story_fbid=1955497154611291&id=341339392693750