సాయి ధరంతేజ్ పై ఉన్న ప్రేమని ఈ విధంగా చూపించిన ఆ హీరోయిన్…? వీడియో వైరల్..!

హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపుగా ఒక వారం నుండి ప్రేక్షకులను అభిమానులను ఈ విషయం కలిచివేసింది. ఎట్టకేలకు సాయిధరమ్ తేజ్ కోలుకున్నట్లుగా ఈ మధ్యన వార్తలు వినిపించాయి. ఇక అంతే కాకుండా త్వరలోనే డిశ్చార్జ్ అవుతున్నట్టుగా కూడా వైద్యులు తెలియజేశారు. ఇక ఎప్పటిలాగే సాయి ధరంతేజ్ మళ్లీ సినిమాలతో బిజీగా ఉండబోతున్నారు.

ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఒక బ్యూటీ.. సాయి ధరమ్ తేజ్ కోసం ఒక వీడియోను పోస్ట్ చేసి తప్పకుండా కోలుకుంటారు అంటూ తెలియజేసింది.అంతేకాకుండా ఆయన చిరునవ్వు మళ్ళీ చూడడం కోసం ఎదురు చూస్తున్నానంటు తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.ఇక తన మీద నాకు నమ్మకం ఉంది అంటూ ఒక స్పెషల్ వీడియో ని పోస్ట్ చేస్తూ తెలిపినది ఈమె. ఇక ఆ హీరోయిన్ ఎవరో కాదు.. హీరోయిన్ లారిసా బోనేసి. ఈమె బ్రెజిల్ ప్రాంతానికి చెందినది. సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమాలో హీరోయిన్ గా నటించింది. సాయి ధరంతేజ్ త్వరగా కోలుకోవాలంటూ.. తిక్క సినిమా ఆడియో ఫంక్షన్ లో ఒక స్పెషల్ వీడియో ని తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి తెలియజేసింది.