సాయి ధరమ్ తేజ్ పై..హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..!

ఇటీవల రెండు రాష్ట్రాలలో సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా అన్ని టీవీ ఛానల్స్ లో 24 గంటలు గా మెగా మేనల్లుడు వార్త గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇక అందులో కొన్ని ఛానల్స్ మాత్రం సాయి ధరంతేజ్ గురించి తప్పుగా రాస్తున్నారు. కొంత మంది సినీ ప్రముఖులు ఆ ఛానల్స్ పై మండి పడుతున్నారు. ఇక నిజానిజాలు తెలుసుకోకుండా ఎవరికి తోచిన విధంగా వారు వార్తలు ప్రసారం చేసుకుంటున్నారు అన్నట్టుగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆది ఫైర్ అవుతున్నారు.

కొన్ని మీడియా సంస్థలు మాత్రం 120 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడంతోనే కింద పడ్డారా అన్నట్లుగా ప్రసారం చేయడంతో , కొంత మంది సినీ ప్రముఖులు వారి మీద కోపం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు.ఆయనకు మెగా ఫ్యామిలీ పై ఉన్న అభిమానం ఎంతో మనకు తెలిసిందే. ఎంతో మంచి వ్యక్తి సాయి ధరంతేజ్.. అలాంటి వ్యక్తి ఈ రోజు రోడ్డు ప్రమాదం జరిగి హాస్పిటల్ లో ఉంటే తట్టుకోలేకపోతున్నా అన్నట్లుగా తెలియజేశాడు.

మీలాంటి మంచి వారికి ఏమీ కాదు.. మిమ్మల్ని చూస్తుంటే కన్నీరు ఆగడం లేదు అన్నట్లుగా తెలియజేశాడు హైపర్ ఆది. ఇక సాయి ధరంతేజ్ 300-400 స్పీడ్ తో బైక్ ను నడిపాడు అన్నట్లుగా వార్తలు రావడంతో.. ఆది హైదరాబాద్ రోడ్లపై.. సూపర్ మ్యాన్, బ్యాట్ మాన్ కూడా అంత స్పీడ్ తో ఈ రోడ్లపై వెళ్ళలేడు అన్నట్లుగా తెలియజేశాడు.. అంతేకాకుండా అలా చూపించిన వారిని.. మీరు ఎక్కడ దొరికేరా బాబు మాకు.. అంటూ ట్వీట్ చేశాడు.