నిందలు వేసినా ఎవరిని మర్చిపోను అన్ని గుర్తు పెట్టుకుంటా.. ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమాలు అంటే నాకు ఇష్టం నాకు సినిమా అన్నం పెట్టిన తల్లి..సినిమా పరిశ్రమ తక్కువ చేయడం లేదు.. కానీ రాజకీయాల్లోకి నచ్చి వచ్చాను నేను సినిమా హీరో నువ్వు కాదు నేను నటుడిని కావాలని కూడా కోరుకోలేదు.. కానీ సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది మీకు యుద్ధం ఎలా కావాలో చెప్పండి .

ప్రజాస్వామ్య పద్ధతిలో నైనా సిద్ధం మరో విధంగా అయినా రెడీ.. మీరు నన్ను తిట్టే కొద్దీ నేను ఇంకా బల పడతాను.. సమస్యలన్నీ ప్రస్తావిస్తే మా ఆడపడుచుల గురించి మాట్లాడతారా..? ఎవరిని మర్చిపోను గుర్తు పెట్టుకుంటా!అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్.నాకు ఏమైనా థియేటర్ లు ఉన్నాయా? మీ వైసీపీ నేతల కే ఉన్నాయి.

కాకినాడ నెల్లూరు లో ఉన్న థియేటర్లు ఎవరివి మీ వారిని కావా? సినిమా టికెట్లు ఎంతైనా పెట్టుకొని చావండి.. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. మా కష్టార్జితం పై మీ పెత్తనం ఏమిటి? ఒక పని చేయండి.. మా ఇళ్లలోకి వచ్చి మా బంగారం లాగేసుకోండి.. వైసిపి వాళ్ళు మాట్లాడడం ఎప్పుడు నేర్చుకుంటారు? అరవడం తప్ప అంటూ పవన్ వైసీపీ నాయకుల పై పవన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.