భార్యతో విభేదాలు.. మేనమామ కూతురితో వివాహం ఆ తరువాత?

సైదాబాద్ సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజుకు అతడి భార్య కు ఇటీవలే విభేదాలు రావడంతో ఆమె సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం జలాల్ పురం నిర్వహిస్తున్నట్లు సమాచారం. రాజు తన మేనమామ కూతురిని ప్రేమ వివాహం చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించిన అతడి భార్య మౌనిక రాజు అలాంటి వాడు కాదని తెలిపింది.

చనిపోయిన రాజు చేతుల పై మౌనిక అనే పచ్చబొట్టు ఉంది. పచ్చబొట్టు ఆధారంగా ఆత్మహత్యకు పాల్పడింది రాజు అని పోలీసులు గుర్తించారు. ఈ పచ్చబొట్టును అతడు కొన్నేళ్ళ క్రితమే వేయించుకున్నాడు అని పోలీసులు తెలుసుకున్నారు. జలాల్ పురంలో ఉంటున్న ఆ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఆమె పేరును మౌనిక గా మార్చాలని కొందరు చెబుతున్నారు. మరికొందరు అతడి మేనకోడలు పేరు అని అని చెబుతున్నారు. ఇంకొందరు అయితే భార్య పేరు మౌనిక అని చెబుతున్నట్లు సమాచారం.