మహేష్ బాబు చేసేది పోకిరి సీక్వెల్ మూవీనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఓ షాకింగ్ కామెంట్ చేశాడు మహేష్.

తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో మహేష్ సర్కారు వారి పాటకు సంబంధించి ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా పోకిరి సినిమాను తలపించడమే కాకుండా, ఆ సినిమాను ఖచ్చితంగా దాటుతుందని ధీమా వ్యక్తం చేశాడు. దీంతో సర్కారు వారి పాట చిత్రం పోకిరికి సీక్వెల్ చిత్రమా అనే సందేహం అందరిలో నెలకొంది. గతంలో పోకిరి చిత్రంలో కూడా మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపించాడు. ఇక ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు మరోసారి అలాంటి సరికొత్త లుక్‌ను మహేష్ ఈ సినిమాకు ట్రై చేస్తుండటంతో ఈ సినిమా పోకిరి సీక్వెల్ అయి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా సరికొత్త అంశానికి మహేష్ తెరలేపడంతో సోషల్ మీడియాలో ఈ వార్తకు సంబంధించి జోరుగా చర్చ సాగుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెత్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, ఈ సనిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.