శ్రీముఖి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీముఖి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని మరింత క్రేజ్ను పెంచుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. మరోవైపు వెండితెరపై సైతం సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ అందాల యాంకరమ్మకు వెంకట్ అనే ఓ అభిమాని ఏకంగా నాలుగు పేజీల ఉన్న లేఖను పోస్ట్లో పంపాడు. ఈ లేఖలో సదరు అభిమానులు అచ్చతెలుగు పదాలు ఉపయోగిస్తూ శ్రీముఖి అందాన్ని, యాంకరింగ్ను, టాలెంట్ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సుధీర్గమైన లేఖలో శ్రీముఖి కెరీర్ లోని ముఖ్యమైన మలుపులను, ఘట్టాలను ప్రస్తావించాడు.
చివరిగా ఈ కళా రంగంలో శ్రీముఖి మరిన్ని శిఖరాలు అధిరోహించాలి, ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించాడు. ఇక ఈ లెటర్ను చదివిన శ్రీముఖి ఆనందంతో ఉబ్బితబ్బిపోయింది. అంతేకాదు, సదరు అభిమాని పంపిన లెటన్ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం శ్రీముఖి పోస్ట్ చేసిన ఫొటోలు వైరల్గా మారాయి.