ఎట్టకేలకు తేజ్ ను పరామర్శించిన బన్నీ..!

సాయి ధరంతేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. తేజ్ ను పరామర్శించడానికి పెద్ద పెద్ద స్టార్ సెలబ్రెటీలు కూడా వచ్చారు.. కేవలం అల్లు అర్జున్ మాత్రమే సాయి ధరంతేజ్ ను పరామర్శించడానికి రాలేదు అని వార్తలు హల్ చల్ చేశాయి.. ఇకపోతే పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అల్లుఅర్జున్ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే , తన మామ చిరంజీవికి అలాగే మిగతా బంధు వర్గాలు కూడా తెలియజేశాడు.. తేజ్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు డాక్టర్ ను అడిగి ఫోన్ లో తెలుసుకుంటున్నాడు.

Allu Arjun | అపోలో ఆస్ప‌త్రికి అల్లు అర్జున్

ఇక నిన్న గురువారం షూటింగ్ ముగించుకొని అల్లు అర్జున్ తేజ్ ను పరామర్శించడానికి గురువారం సాయంత్రం అపోలో ఆస్పత్రికి వెళ్లాడు. అంతేకాదు తేజ్ తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం తేజ్ ను వెంటిలేటర్ అవసరం తగ్గిపోయినా కూడా ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నారు.. ఆయన కొద్దికొద్దిగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మరో రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు అని , ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.