ఆది పురుష్ నుంచి అఫీషియల్ అప్డేట్..!

సినీ ఇండస్ట్రీలో హీరో ప్రభాస్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.హీరో ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా నుంచి ఫాన్స్ ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చేసింది. ఈ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేస్తున్నారు.ఈ సినిమా 2022 ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు గా సమాచారం.

ఇక ఈ చిత్రాన్ని 3డి నిర్మాణంలో తెరకెక్కించబోతున్నారట. ఈ సినిమాని తెలుగు, తమిళ కన్నడ, మలయాళం భాషలలో కూడా ఆగస్టు 11వ తేదీని 2022 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ లీడ్ రోల్ ను పోషిస్తున్నారు.

ఏదిఏమైనా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో అన్ని పాన్ ఇండియా మూవీ లోనే తెరకెక్కిస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాల్సిందే.