తన దేశాన్ని కాపాడండి అంటూ ప్రపంచ ప్రజలను కోరుతున్న క్రికెటర్ రషీద్ ఖాన్..

రషీద్ ఖాన్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈయన పేరే వినిపిస్తోంది.. ముఖ్యంగా జాతీయ క్రికెట్లోనే కాకుండా ఐపీఎల్ మ్యాచ్ లో కూడా రషీద్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ టీం కు ప్రాతినిధ్యం వహించడంతో తెలుగు ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యాడు అని చెప్పవచ్చు. రషీద్ ఖాన్ ఇటీవల ట్విట్టర్ లో తన అధికారిక ఖాతా ద్వారా భావోద్వేగమైన ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అది కాస్తా వైరల్ గా మారింది. ఇక ఆ ట్విట్టర్ ద్వారా ఆయన ఏమి కోరారంటే..

ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు తిరిగి వెనక్కి వెళ్లిపోవడంతో , ఆఫ్ఘనిస్తాన్ కాస్త తాలిబన్ల గుప్పెట్లోకి వెళ్లడానికి అతి చేరువలో ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే తాలిబన్ల, ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి మధ్య యుద్ధం గత కొద్ది రోజుల నుంచి జరుగుతూనే ఉంది.. ఇక ఈ నేపథ్యంలోనే తాలిబన్ల దాడులకు మహిళలు, చిన్నారులు కూడా బలి అవుతున్నారు. ఇక ముఖ్యంగా మానవత్వం కొరవడి సంక్షోభం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఎన్నో వేల కుటుంబాలు హింసకు గురి అవుతున్నాయి..

రషీద్ ఖాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన వాడు కాబట్టి ఆయన మరింత భావోద్వేగానికి గురి అవుతున్నాడు. ఆయన నా దేశాన్ని ఈ గందరగోళం నుంచి కాపాడండి అంటూ కోరుకుంటున్నాడు. ప్రపంచ నాయకులారా..! నా దేశం బాధలో కూరుకుపోయింది. ఎంతో మంది చిన్నారులు , మహిళలతో సహా కొన్ని వేల మంది అమాయకులు కూడా రోజు ప్రాణాలను కోల్పోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న ఈ గందరగోళంలో నా దేశాన్ని అలాగే వదిలేయకండి ..అంటూ ఆయన కోరుతున్నాడు. అంతే కాదు మా దేశం శాంతిని కోరుకుంటుంది. ఎలాగైనా సరే మా దేశాన్ని కాపాడండి అంటూ రషీద్ ఖాన్ ట్వీట్ చేయడం తో ..ప్రస్తుతం ఇది కాస్తా వైరల్ గా మారింది.