బాలీవుడ్ గాయకుడు, నటుడు యోయో హనీ సింగ్పై ఆయన భార్య శాలిని కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ తల్వార్ ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో గృహహింస చట్టం కింద శాలిని హనీ సింగ్ పై పిటిషన్ దాఖలు చేసింది. హనీసింగ్కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, అతడు తన కుటుంబసభ్యులతో కలిసి తనను తీవ్రంగా వేధించాడని చెప్పుకొచ్చింది.
అంతేకాదు, ఆమె గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం కింద రూ. 10 కోట్ల పరిహారం కోరింది. దాంతో వీరి ఇష్యూ ప్రస్తుతం వార్తల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా శాలిని మరో బాంబ్ పేల్చింది. తన భర్తే కాకుండా మామ కూడా తనతో నీచంగా ప్రవర్తించాడని పేర్కొంది.
ఒక సారి తాను బట్టలు మార్చుకుంటుంటే హానీ సింగ్ తండ్రి తప్ప తాగి తన గదిలోకి వచ్చాడని, అసభ్యకరంగా తన వంటి పై చేతులు వేశాడని శాలిని ఆరోపించింది. దీంతో ఈమె వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి.