పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రమ్య శ్రీ..

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత క్రేజ్ ఉందో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుచేత అంటే అతను ఫ్యాన్ ఫాలోయింగ్ అంతగా ఉంటుంది కాబట్టి. ఇదే తరుణంలో ప్రజల కోసమే తను ఒక పార్టీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ పార్టీ తో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇప్పుడు ఒక నటి పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసింది ..ఆ విషయం చూద్దాం.

రమ్యశ్రీ 2019లో వైఎస్సార్సీపీ తరఫున ప్రచారం చేసింది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన బతుకులు బాగానే ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ అంతటి నటుడు తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది రమ్య శ్రీ. ఇక ఈయన సినిమాలలో బాగా నటిస్తారు కాబట్టే ఆయనను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని తెలిపింది.

సినిమాల విషయంలో అయితే సక్సెస్ అయ్యాడు కానీ రాజకీయ విషయానికొస్తే విఫలం అయిందని తెలిపింది రమ్య శ్రీ. ఇక జనసేన పార్టీ తరపు నుంచి తన సోదరుడు పోటీ చేస్తే రెండు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చింది అని చెప్పుకొచ్చింది. ఈ రోజున టీ డీ పీ ఓడిపోవడానికి కారణం జనసేన పార్టీ అని చెప్పింది.

పవన్ కళ్యాణ్ మధ్య మధ్యలో వేరొక పార్టీకి మద్దతు ఇస్తూ ఉండడం వల్లే, ఇలాంటివన్నీ జరిగాయని చెప్పినది. ఇక అంతే కాకుండా ఎన్నికల్లో పవన్ ప్రభావం చూపించలేకపోయారు అని పేర్కొన్నది. ఇక తనకి కూడా అవకాశం వస్తే వైసీపీ తరఫున పోటీ చేస్తానని తెలిపింది ఈమె. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ప్లానింగ్ ఆయనకు కూడా ఉన్నదని 2024 వరకు పవన్ తో కలిసి ఎంతమంది ఉంటారో వేచి చూడాలి అని తన మనసులో మాట చెప్పింది రమ్య శ్రీ.