మహేష్ బాబు మరొక సినిమా మల్టీప్లెక్స్ ను నిర్మించబోతున్నాడు..?

మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం నుంచే బిజినెస్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన థియేటర్ ల బిజినెస్ లో కూడా దిగిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు ఇదివరకే హైదరాబాద్ లోని ఏషియన్ మూవీస్ లో భాగమైన విషయం తెలిసిందే.. ఈ మల్టీప్లెక్స్ కు మొదటి నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహానగరంలో సినీ ప్రేక్షకులకు మూవీ చూడటానికి బాగా ఇష్టపడే మల్టీప్లెక్స్ లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు.

ఈ మల్టీ ప్లెక్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొదటి ప్రయారిటి గా ఉంటుంది. చాలా వేగంగా బుకింగ్ జరిగే మల్టీప్లెక్స్ లలో ఇది ఒకటి చెప్పుకోవచ్చు. ప్రసాద్ మల్టీప్లెక్స్ తర్వాత ఎక్కువ షోలు వేసే థియేటర్ ఇదే.. ఇటీవల కొత్తగా రాజా రాజా చోర సినిమాని కూడా ఇక్కడ ప్రదర్శించిన సంగతి అందరికీ తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లోనే కాక కొత్త నగరాల్లో ఏ ఎం బి సినిమాస్ లో కొత్త మల్టీ ఫ్లెక్స్ రాబోతున్నట్లుగా వినిపిస్తోంది. కానీ కరోనా మహమ్మారి వచ్చి అడ్డు పడింది. దాంతో ప్లాన్ అంతా తారుమారైంది. సెకండ్ వెంచర్ కు మాత్రమే సన్నాహాలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. తొలి వెంచర్ కంటే భారీగా సరికొత్త టెక్నాలజీ తో తీర్చి దిద్దుతున్నారు.

ఇక్కడ స్క్రీన్ ల కౌంట్ కూడా ఎక్కువేనట. ఇక్కడ స్క్రీన్ భారీగా ఉంటదని, ఇండియాలో బెస్ట్ మల్టీప్లెక్స్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా , ఈ థియేటర్ ని తీర్చిదిద్దుతున్నారు . ఓపెనింగ్ తర్వాత ట్రెండ్ సెంటర్ కావచ్చని చెప్పవచ్చు. కరోనా ప్రభావం తగ్గుదలను బట్టి తెలుగు రాష్ట్రాల్లోనే, మరిన్ని నగరాలకు అలాగే వేరే రాష్ట్రాల సిటీలలో కొత్త వెంచర్ లను సిద్ధం చేస్తున్నారట