భార‌త్‌లో ఊర‌ట‌నిచ్చిన క‌రోనా..భారీగా త‌గ్గిన రోజూవారీ కేసులు!

చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

గ‌త కొద్ది రోజులుగా 40 వేల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. నిన్న మాత్రం భారీగా దిగొచ్చాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 30,941 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,27,68,880 కు చేరుకుంది. అలాగే నిన్న 350 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,38,560 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 36,275 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,19,59,680 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 3,70,640 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.