భార‌త్‌లో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు..478 మంది మృతి!

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి అనుకుంటున్న‌ త‌రుణంలో.. మ‌ళ్లీ క‌రోనా స్పీడ్ పెంచింది.

అయితే నిన్న మాత్రం క‌రోనా కేసులు స్వ‌ల్పంగా దిగి వ‌చ్చాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 38,667 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,21,56,493 కు చేరుకుంది. అలాగే నిన్న 478 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు.

దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,30,732 కు పెరిగింది. ఇక నిన్న ఒక్క‌రోజే 35,743 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,13,38,088 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 3,87,673 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నిన్న దేశ‌వ్యాప్తంగా 22,29,798 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.