అప్పట్లో నాగార్జున కే సొంతం.. ఇప్పుడు ఆ రికార్డు రామ్ చరణ్ కే సొంతం..?

టాలీవుడ్ లో నవమన్మధుడు గా పేరుపొందాడు నాగార్జున అప్పటి నుంచి ఇప్పటివరకు తన వయసు మీదపడుతున్న ఇంకా కుర్ర హీరోల కనిపిస్తున్నాడు నాగార్జున. ఇక రామ్ చరణ్ కూడా ఎంతో పెద్ద స్టార్ హీరో అని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక రికార్డును క్రియేట్ చేసినటువంటి లిస్టులో వీరిద్దరే ఉన్నారు. అదేమిటంటే అప్పట్లో నాగార్జున కే సొంతం, ప్రస్తుతం రామ్ చరణ్ కే ఆరికార్డు సొంతం అన్నట్టు గా వినిపిస్తోంది.

రామ్ చరణ్ తన తండ్రితో కలిసి కొణిదెల ప్రొడక్షన్ లో కొన్ని సినిమాలను నిర్మించడం జరిగింది. ఇప్పుడు ముచ్చటగా మరొక సినిమాను నిర్మిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇక ఆచార్య సినిమాలో కూడా చిరంజీవితో కలిసి రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక ఆ సినిమా తరువాత గాడ్ ఫాదర్ సినిమాను కూడా రామ్ చరణ్, సూపర్ గుడ్ ఫిలిం సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం.

ఇక నాగార్జున విషయానికొస్తే, ఈయన కూడా తన తండ్రి నాగేశ్వరరావుతో.. అన్నపూర్ణ స్టూడియో ద్వారా ఎన్నో చిత్రాలను నిర్మించి విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ కలిసి తండ్రితో సినిమాలను నిర్మించిన హీరోలుగా ఒక రికార్డును క్రియేట్ చేశారు.ఇక ఆ తర్వాత హీరో హరికృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. కానీ ఆ సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాడు అంతే.

అలా తండ్రీ కొడుకులు కలిసి సినిమా నిర్మించిన కథానాయక లిస్టులో వీరిద్దరికీ చోటు దక్కింది. ఇక మిగతా హీరోలకు ఈ అవకాశం వస్తుందో..? రాదో..? వేచి చూడాల్సిందే. అందుచేతనే అప్పట్లో కేవలం నాగార్జున కే సొంతమైన క్రెడిట్, ప్రస్తుతం తరం వారిగా ఆ క్రెడిట్ రామ్ చరణ్ కే సాధ్యమైందనే చెప్పాలి.