టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం స్టాండప్ రాహుల్. కూర్చుంది చాలు అన్నది ట్యాగ్ లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్ పతాకాలపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను దగ్గుబాటి రానా విడుదల చేశారు. హెడ్ ఫోన్స్ పిచ్చ లైట్ బ్రో అనే లైన్ ని చూపిస్తూ.. రాజ్ తరుణ్ ఓ స్టేజ్ పై మాట్లాడుతుండటంతో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం హిలేరియస్ ఫన్ తో మంచి ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఓ స్టేజ్ స్టాండప్ జోక్స్ చెప్పే వాడిలా రాజ్ తరుణ్ ఈ టీజర్లో కనిపించాడు.
అలాగే పిల్లల్ని కనడానికి తప్ప మగాళ్లు అవసరం లేదని ప్రియాంక చోప్రా అంటే అందరూ ఈలలు వేశారు. అదే మా చలపతిరావు అంటే గోల గోల చేశారు.. ఒక అబ్బాయి సింగిల్ గా ఉంటే పులి అవుతాడు. అదే అమ్మాయితో ఉంటే పులిహోర అవుతాడు అని రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ ఆకుట్టుంటోంది. మెత్తానికి టీజర్ చూస్తుంటే.. ఏదో డిఫరెంట్ కథతోనే రాజ్ తరుణ్ వస్తున్నట్టు అర్థం అవుతోంది. మరి లేట్ చేయకుండా మీరూ టీజర్పై ఓ లుక్కేసేయండి.