దర్శక ధీరుడు రాజమౌళి సినిమా వచ్చింది అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కల్లెక్షన్ ల వర్షం కురవాల్సిందే. ఆయన సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదిరి చూస్తారు. అయితే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్టు పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజమౌళి ఈసారి సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేసుకుంటున్నట్టు తెల్సింది. తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఓ అడ్వెంచర్ కథను రాజమౌళి సిద్ధం చేస్తున్నారని ఈ విషయం గురించి రాజమౌళి తండ్రి, అగ్ర రచయిత విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
ఆఫ్రికా అడవుల నేపథ్యంలో జరిగే ఓ అడ్వెంచరస్ స్టోరీ లైన్ తో రాజమౌళి సినిమా ఉంటుందని విజయేంద్రప్రసాద్ తెలిపారు. ప్రముఖ ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా కథా రచన చేయబోతున్నామని చెప్పారు. హాలీవుడ్, బాలీవుడ్ లో జంగిల్ అడ్వెంచర్ నేపథ్యంలో వచ్చిన సినిమాలో ఎంతో ప్రజాదరణ పొందాయని తెలుగులో కూడా అదే స్థాయిలో మహేష్ బాబుతో సినిమా రుపొందించబోతున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్బాబుకు రెండు సినిమా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవి పూర్తవ్వగానే మహేష్బాబు-రాజమౌళి కంబోలో చిత్రం మొదలు కానుంది.