బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భార్య, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా.. మరోవైపు ఓ చీకటి వ్యాపారానికి అధిపతిగా కూడా చెలామణి అవుతున్నాడని బలమైన ఆధారాలు సంపాదించిన పోలీసులు.. మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
భర్త అరెస్ట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన శిల్పా శెట్టి.. ఓ కీలక నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం ఆమె జడ్జిగా ఉన్న ఓ రియాలిటీ షో నుంచి తప్పుకోవాలని శిల్పా నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను సోనీ టీవీ రిలీజ్ చేసింది. ఇందులో శిల్పా శెట్టి స్థానంలో కరీష్మా కపూర్ కనిపించడంతో.. తాజా వార్తలకు మరింత బలం చేకూరాయి.
ఇక మరోవైపు శిల్పా శెట్టి నటించిన హంగామా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చిన శిల్పా.. ఈ మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని భావించింది. కానీ, ఇంతలోనే భర్త చీకటి వ్యవహారం బయటపడటంతో.. శిల్పా ఆశలపై నీళ్లు జల్లినట్టు అయింది.