ఈ స్మార్ట్ ఫోన్ కాలంలో వ్యక్తిగత సమాచారానికి భద్రత కరువయ్యింది. బ్యాంకు అకౌంట్ లను, సోషల్ మీడియా అకౌంట్ లను హ్యాక్ చేస్తూ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ సైబర్ వలలో సామాన్య జనాలే కాకుండా సెలెబ్రెటీలు కూడా చిక్కుంటున్నారు. తాజాగా నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ట్విటర్ అకౌంట్ ను దుండగులు హ్యాక్ చేశారు. హ్యాకర్ ఆమె అకౌంట్ పేరును బ్రియాన్గా మార్చాడు. కవర్ ఫొటో కూడా వేరేది మార్చేశాడు. దీంతో ఆమె చేసిన అన్ని ట్వీట్లూ డిలీట్ అయిపోయాయి.
నటి ఖుష్బూ కు ఈ పరిస్థితి ఎదురుకావడం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్లో కూడా ఆమె అకౌంట్ను ఇలాగే ఎవరో హ్యాక్ చేశారు. ఇలా జరిగినప్పుడు ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పింది. ఈసారి కూడా ఆమెకు సేమ్ సీన్ ఎదురయ్యింది. 48 గంటల నుంచి పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని ఖుష్బూ చెప్తోంది.