ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం ఎప్పుడంటే..?

తాజాగా ఏపీలో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలను తిరిగి పున: ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ తెలియచేసారు. అంతే కాకుండా జూలై 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగష్టు నెలలోపు విద్యాసంస్థల్లో పెండింగ్ లోఇంకా పూర్తి అవ్వని నాడు నేడు పనులను అన్ని కూడా పూర్తి చేయాలని అధికారులు సీఎం ఆదేశించారని మంత్రి పేర్కొన్నారు.

ఈ సందర్బంగా ఇంటర్ సెకండియర్ మార్కుల పై కూడా సీఎం జగన్ ఒక నిర్ణయానికి వచ్చారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. అలాగే ఏపీలో 10వ తరగతి మార్కులు 30 శాతం, ఇంటర్ ప్రధమ సంవత్సరం మార్కులు 70 శాతం ప్రాతిపదికగా విద్యార్ధులకు సెకండియర్ మార్కులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ఈ నెలా చివరి లోపు మార్క్స్ మెమోలను విద్యార్థులకు జారీ అవుతాయి అని మంత్రి పేర్కొన్నారు.