లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లావణ్య.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్ల అందుకున్న ఈ భామ.. ఇటీవల ఏ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.
కానీ, ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠికి తాజాగా ఓ భారీ ఎండార్స్ మెంట్ డీల్ వచ్చింది. ‘గోల్డ్ విన్నర్’ ఆయిల్ సంస్థకు దక్షిణాది మొత్తానికి బ్రాండ్ అంబాసడర్ గా లావణ్య ఎంపికైంది. వాస్తవానికి ఇంతకాలం గోల్డ్ విన్నర్ ఆయిల్ సౌత్ ఇండియా మార్కెట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఉండేవారు.
అయితే ఇప్పుడు ఆయన స్థానంలో లావణ్య త్రిపాఠి వచ్చి చేరింది. ప్రస్తుతం ఆమెపై చెన్నైలో యాడ్ షూట్ జరుగుతోంది. మహేష్ నటించిన యాడ్ లోకి ఆమె రావటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక లావణ్య దశ తిరిగినట్టేనని, ముందు ముందు ఆమెను మరిన్ని బ్రాండ్స్ వరించే అవకాశం ఉందని అంటున్నారు.