ప్రముఖ వ్యాపారవేత్త అయిన రాజ్కుంద్రా తన మొదటి భార్య కవిత నుంచి విడిపోవడానికి గల సంచలన కారణాలను తెలిపారు. తన మొదటి భార్యతో విడిపోవడానికి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి కారణం కాదని స్పష్టం చేశారు. 12 ఏండ్ల తర్వాత తన భార్య కవితతో విడిపోవడానికి ఓ పెద్ద కారణం ఉందన్నారు. ఆమె తన చెల్లి భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కామెంట్లో బీటౌన్లో వీరి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్గా మారింది.
తాను మొదటి భార్య కవిత కొన్నేళ్ల క్రితం లండన్లో ఉన్నట్టు తెలిపాడు రాజ్కుంద్రా. ఆ టైమ్లో తన చెల్లి, ఆమె భర్త కూడా వారితో కలిసి ఉండేవారని చెప్పాడు. ఆ టైమ్లోనే కవితకు తన చెల్లెలి భర్తతో సంబంధం ఏర్పడిందన్నారు. తాను బిజినెస్ పనులపై ఎప్పుడైనా టూర్కి వెళ్తే కవిత అతనితో కలిసేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. దాంతో తన చెల్లిల్ని, ఆమె భర్తను ఇండియాకు పంపించినా… కవిత మాత్రం అతడితో మాట్లాడుతూనే ఉందంటూ వివరించారు. ఈ కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చానని రాజ్కుంద్రా స్పష్టం చేశాడు.