బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. సాహాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన జాక్వెలిన్.. పవన్ కల్యాణ్, క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు చిత్రంలోనూ నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ శ్రీలంక భామకు సంబంధించిన ఓ వార్త బీటౌన్ వర్గాల్లో జోరుగా వైరల్ అవుతోంది.
సౌత్ ఇండియాకి చెందిన ఓ వ్యాపారవేత్తతో జాక్వెలిన్ రిలేషనల్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ప్రియుడితో గడిపేందుకు జాక్వెలిన్ ముంబై జుహూలో రూ. 175 కోట్లతో సముద్ర ముఖంగా ఉన్న బంగ్లాను కొనుగోలు చేసిందట.
ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్ డిజైన్ చేయించడానికి ఒక ఫ్రెంచ్ ఇంటీరియర్ డిజైనర్ను కూడా ఖరారు చేశారట. ఇంటి పనులన్నీ ఫాస్ట్గా పూర్తి చేయించి.. త్వరలోనే ప్రియుడితో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ కాబోతోందట జాక్వెలిన్.