`ప్రతాపరుద్రుడు`గా మ‌హేష్‌..తెర‌పైకొచ్చిన ఇంట్ర‌స్టింగ్ ప్రాజెక్ట్‌!

టాలెంటెడ్ అండ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం స‌మంత‌తో శాకుంతలం సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యాబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రిన్స్‌ మహేష్ బాబుతో ప్రతాపరుద్రుడు అనే టైటిల్‌తో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ ప్ర‌స్తుతం సన్నాహాలు చేస్తున్నట్టు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. లాక్ డౌన్ టైమ్‌లో ఈ కథపై క‌స‌ర‌త్తు చేశాడ‌ట‌ గుణ‌శేఖర్‌.

అంతేకాదు, త్వ‌ర‌లోనే మ‌హేష్ బాబుకు కూడా ఈ క‌థ చెప్ప‌నున్నాడ‌ట‌. మ‌రి చారిత్రకాలు .. పౌరాణికాలపై పెద్దగా ఆసక్తిని చూపని మహేశ్ బాబు గుణ‌శేఖ‌ర్‌కు ఓకే చెబుతాడా? లేదా..? అన్న‌ది చూడాలి. కాగా, మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మ‌హేష్‌ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.