అమానుష్యం : కంటతడి పెట్టిస్తున సీన్..!

కరోనాతో దేశంలో చాలా మంది ప్రాణాలను వదిలారు. ఇంకా కొందరు కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకుంటూ కరోనాను అంతం చేసేందుకు పూనుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఘటన పలువురిని కంటతడి పెట్టేలా చేస్తోంది. ఉత్తరాఖండ్ లోని భాగీరథి నది ఒడ్డునే ఉన్న కేదార్‌ఘాట్‌ శ్మశానంలో సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నట్లున్న సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇదంతా మున్సిపల్, జిల్లా అధికారుల నిర్లక్ష్య వల్లనేనని మండిపడుతున్నారు. కోవిడ్‌ బారిన పడి చనిపో యిన వారికి కూడా ఈ శ్మశానంలోనే అంత్యక్రియలు జరుపుతున్నారని, కుక్కలు పీక్కు తింటున్న మృతదేహాల్లో వైరస్‌ బారిన పడినవి కూడా ఉండి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భాగీ రథి నదిలో నీటి మట్టం పెరగడంతో సరిగా కాలని మృతదేహాలు కొన్ని వరదలో కొట్టుకుపోగా, మిగతా వాటిని కుక్కలు లాక్కెళుతున్నాయని అం టున్నారు.