ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. ఇక నిన్న కరోనా కేసులు స్వల్పంగా తగ్గగా.. మరణాలు పెరిగాయి.
గత 24 గంటల్లో భారత్లో 51,667 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,34,445 కు చేరుకుంది. అలాగే నిన్న 1,329 మంది కరోనా కారణంగా మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,93,310 కు పెరిగింది.
ఇక నిన్న ఒక్కరోజే 64,527 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశంలో కరోనా నుంచి 2,91,28,267 మంది హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 6,12,868 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, నినొక్కరోజే 17,35,781 కరోనా టెస్ట్లు నిర్వహించారు అధికారులు.