చిరుపై శ్రీ రెడ్డి సంచలన కామెంట్స్..?

నిత్యం సంచ‌ల‌న కామెంట్లు చూస్తూ వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి మెగాస్టార్ చిరంజీవినిపై సంల‌చ‌న వ్యాఖ్య‌లు చేసింది. ఏకంగా చిరంజీవి కులం పేరును ప్రస్తావిస్తూ విమ‌ర్శ‌లు చేసింది. సీఎం జగన్ ఇప్పుడు ఏపీ నుంచి చిరంజీవికి రాజ్యసభ టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీని ద్వారా పవన్ కళ్యాణ్‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌నే ఆలోచ‌న‌లో లనే జగన్ ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే ఈ ప‌రిణామంపై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించిది. మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభ సీటుకు అర్హుడు కాద‌ని చెప్పింది. చిరంజీవి కేంద్ర మంత్రి పదవిని కూడా స‌రిగ్గా ఉప‌యోగించుకోలేద‌ని విమ‌ర్శించింది. అస‌లు చిరంజీవి కాపు కులానికి చెందిన వ్యక్తి కాదని సంచ‌ల‌న కామెంట్లు చేసింది. చిరంజీవి నిజమైన కాపు కాదని, కాబ‌ట్టి నిజమైన కాపు నాయ‌కుడికి పదవి ఇవ్వాల‌ని సీఎం జగన్ ను కోరింది శ్రీ రెడ్డి. ఇక అప్పట్లో జగన్ మీద నాగబాబు చేసిన దారుణ‌మైన జోక్‌ను గుర్తు చేసింది శ్రీరెడ్డి.