ఈ కరోనా సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపించిన పేరు ఆనందయ్య కరోనా మందు. దీని కోసం ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మందిఎదురు చూస్తున్నారు. ఇక రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా దీనికి ఓకే చెప్పింది. దీంతో ఈ మందును ఎప్పుడు పంపిణీ చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనిపై క్లారిటీ వచ్చింది.
ఆనందయ్య కరోనా మందును వచ్చే సోమవారం .. అనగా ఈ నెల 7 నుంచి మందు పంపిణీ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ మందు పంపిణీపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు మంగళవారం ఆనందయ్యతో కలెక్టర్ చక్రధర్బాబు ఎస్పీ భాస్కర్భూషణ్ ఇతర శాఖల ముఖ్య అధికారులు సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి భేటీ అయ్యారు. వారంతా ఆనందయ్యతో చర్చించి ఎలా పంపిణీ చేయాలనేదానిపై కూలంకుషంగా చర్చించారు. తాము చెప్పేవరకు మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని కోరారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని కోరారు. ప్రస్తుతం కృష్ణపట్నం లో 144 సెక్షన్ కొనసాగుతుంది.