కరోనా కారణంగా ఓటీటీల హవా బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. ఇక ఇటీవలె లెవెంత్ అవర్ వెబ్ సిరీస్తో పలకరించిన తమన్నా.. తాజాగా మరో వెబ్ సిరీస్తో ప్రేక్షకులను పలకరించబోతోంది. తమిళంలో తమన్నా నటించిన తాజా వెబ్ సిరీస్ నవంబర్ స్టోరీ. ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమమైన ఈ సినిమాకి ఇంద్ర సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు.
ఈ వెబ్ సిరీస్ తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్ స్టార్లో మే 20 నుంచి విడుదల కానుంది. అయితే తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. లాక్ చేయబడిన తమన్నా ఇంట్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు. ఆ వ్యక్తిపై 47 సార్లు పెన్నుతో పొడిచిన హంతకుడు..మృతదేహంపై పెయింట్ పోసి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా చేస్తాడు.
దాంతో ఈ కేసు సవాలుగా మారి తమన్నా తండ్రే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నట్లు చూపించారు. ఇక తన తండ్రికి, ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదని నిరూపించేందుకు తమన్నా ఏం చేసింది..అసలు హంతకుడు ఎవరు.. ఇవి తెలిపాయలంటే నవంబర్ స్టోరీ చూడాల్సిందే. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో ఉన్న ఈ ట్రైలర్ అద్యంతం సూపర్ థ్రిల్లింగ్గా కొనసాగింది. మరియు సిరీస్పై అంచనాలను పెంచేసింది.