ఆస్ప‌త్రి నుంచి ఎంపీ రఘురామ డిశ్చార్జ్..!

వివాదాస్పద వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామ కృష్ణరాజు తాజాగా సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోల్పోవడంతో వైద్యులు సలహా మేరకు ఆయనను డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన డిశ్చార్జ్ అయ్యాక నేరుగా బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఇదివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న ఆరోపణల భాగంగా ఏపీ సిఐడి అధికారులు ఆయనను అరెస్ట్ చేసి గుంటూరు కి తరలించిన సంగతి అందరికీ తెలిసిందే.

అలా ఆయన తీసుకొని వెళ్ళిన తర్వాత పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేశారని తెలుపుతూ ఆయన నేరుగా సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఆర్మీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా తాజాగా ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో బెయిల్ మంజూరు చేసినట్లు సుప్రీం కోర్టు తెలిపిన విషయం తెలిసిందే.