లాక్ డౌన్ సమయంలో ఈ పాస్ లేకుండా బయటకు వచ్చారని టాలీవుడ్ హీరో నిఖిల్ వాహనాన్ని పోలీసులు ఆపారు. కరోనా కట్టడికి తెలంగాణలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ సమయంలో ఎవరూ బయటకు వచ్చినా ఈ పాస్ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధన విధించింది. ఈ నేపథ్యంలో అత్యవసర మందులను అందజేయడం కోసం హీరో నిఖిల్ కారులో వెళ్తుండగా పోలీసులు అతన్ని ఆపేశారు. ఈ విషయాన్ని హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ఉప్పల్ నుంచి కిమ్స్ హాస్పిటల్ రోడ్డు వైపు అత్యవసరమైన మందులను ఇవ్వడానికి కారులో వెళ్తున్నాను. ప్రిస్క్రిప్షన్, పేషెంట్ డీటెయిల్స్ పోలీసులకు చూపించినా.. పోలీసులు తనను ఆపారని, ఈ పాస్ తీసుకోమన్నారని చెప్పాడు. ఈ పాస్ కోసం ఆన్ లైన్ లో ట్రై చేసినా ఫలితం లేదని, సర్వర్ డౌన్ అయ్యిందని చెప్పాడు. అత్యవసర పరిస్థితుల్లో ఈ పాస్ లేకున్నా అనుమతిస్తారేమోనని అనుకుని బయటకు వచ్చానని హీరో నిఖిల్ చెప్పాడు. నిఖిల్ చేసిన ట్వీట్ కి పోలీసులు స్పందించారు. ఆయన నుండి అవసరమైన వివరాలు తీసుకుని పోలీసులు హీరో నిఖిల్ సమస్యను పరిష్కరించారు. నిఖిల్ అత్యవసరంగా మందులు అవసరమున్న పేషెంట్ కి మందులను అందజేశాడు.
Was on the way to deliver Emergency Life saving Medicines from Uppal to Kims Minister road… Inspite of providing the Prescription and patient details.. was stopped and asked to Get an Epass.
Tried 9 times but the sever is down…
I thought medical emergencies were allowed!!! pic.twitter.com/qEVWqlJkGj— Nikhil Siddhartha (@actor_Nikhil) May 23, 2021