దేశంలో త‌గ్గుతున్న క‌రోనా కేసులు..3వేల‌కు పైగా మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో గత కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, త‌గ్గుతూ వ‌స్తున్నాయి.

గత 24 గంటల్లో భారత్‌లో 1,73,790 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247 కు చేరుకుంది. అలాగే నిన్న 3,617 మంది క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించారు. దీంతో దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 3,22,512 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 2,84,601 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 2,51,78,011 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే 22,28,724 మంది ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశవ్యాప్తంగా నిన్నొక్క‌రోజే 20,80,048 మందికి కరోనా పరీక్షలు చేశారు.