మరో వెబ్ సిరీస్ కుసై అన్న మిల్కీ బ్యూటీ.!

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇటీవలే లెవెన్త్ అవర్ తో తన మొదటి తెలుగు వెబ్ సిరీస్‌ తో డిజిటల్ రంగంలోకి ప్రవేశించింది. ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 9న ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ అయిన ఆహాలో ప్రసారం అయ్యింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్ కు భారీగా ప్రచారం ఇచ్చినప్పటికీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

తమన్నా ఆహా కోసం మరిన్ని వెబ్ సిరీస్‌లకు సంతకం చేస్తోంది అని సమాచారం. డిజిటల్ రంగంలో మొదటి వెబ్ సిరీస్ తోనే పరాజయం పాలైన ఈ బ్యూటీ ఇటీవలే ఆహాలో తన తదుపరి వెబ్ షో కోసం సంతకం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక పోతే తమన్నా గోపీచంద్ హీరోగా చేస్తున్న సీటిమార్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా నితిన్ తో అంధాదున్ తెలుగు రీమేక్ లో, సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో తమన్నా నటిస్తోంది.