ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` సినిమాతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ రాకింగ్ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ చిత్రంతో అన్ని భాషల్లోనూ సూపర్ క్రేజ్ ఏర్పర్చుకున్న యష్..ఇప్పటికే కేజీఎఫ్ 2ను కూడా పూర్తి చేశారు.
ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే.. సినిమాలు చేస్తూ కోట్ల పారితోషకం పుచ్చుకుంటున్న యష్.. ఇప్పుడు వ్యవసాయం చేసేందుకు కూడా సిద్ధం అయ్యాడు. ఇటీవలె ఈయన తన సొంతూరు కర్ణాటక రాష్ట్రంలోని హస్సాన్ జిల్లాలో వంక ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.
అయితే తాజాగా సొంతూరికి వెళ్లిన యష్ తాను కొనుగోలు చేసిన భూమిని వ్యవసాయానికి, మొక్కలు పెంపకానికి అనువుగా దగ్గరుండి స్వయంగా పనులు చేయిస్తున్నారు యష్. అలాగే ఫార్మ్ హౌస్ లో జేసీబీలతో వర్క్ చేయిస్తున్నాడు. ఇక ఇప్పటికే తన పొలం చుట్టూ కాంపౌండ్ వాల్ను కూడా నిర్మించారు. ప్రస్తుతం పొలం పనుల్లో బిజీ బిజీగా ఉన్న యష్ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి.