నితిన్ జోరు..`యాత్ర‌` డైరెక్ట‌ర్‌తో క్రేజీ మల్టీస్టారర్?!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె చెక్‌, రంగ్ దే చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నితిన్.. ప్ర‌స్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంతో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ చిత్రం పూర్తి కాగానే కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే టైటిల్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రం ఇంకా సెట్స్ మీద‌కు వెళ్ల‌కు ముందే.. మ‌రో ప్రాజెక్ట్‌ను లైన్ పెట్టాడ‌ట‌. యాత్ర సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మహి.వి రాఘవ్.. ఓ క్రేజీ మల్టీస్టారర్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌.

పోలీస్ ఆఫీస‌ర్స్ అయిన ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన కథ అట‌. అయితే రాఘవ్ ఇటీవల నితిన్ ను కలిసి ఆ కథ చెప్ప‌గా.. నితిన్‌కు అది బాగా న‌చ్చింద‌ట‌. దీంతో వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పవర్ పేట తరువాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.