మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచాయలు అవసరం లేదు. `ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్లంతా తిమ్మిరెక్కిందా` అంటూ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ పక్కన చిందులేసి తెలుగు ప్రేక్షకులగా బాగా దగ్గరైంది ఈ చిన్నది. ఆ తర్వాత కింగ్, కృష్ణార్జున, హోమం ఇలా పలు చిత్రాల్లో నటించింది.
అయితే క్యాన్సర్ రావడంతో కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ మురళి పద్మానాభన్ దర్శకత్వంలో మమతా ఓ సినిమా చేస్తోంది.
ఐటీ, థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో సాగుతున్న ఈ మూవీ లాల్బాగ్ అనే టైటిల్తో రాబోతోంది. తాజాగా ఈ సినిమా పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో తెరెకక్కుతున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.