కరోనా వైరస్ మళ్లీ శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. మరోవైపు కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఎందరో సెలబ్రెటీలకు సోకిన కరోనా.. ఇప్పుడు బుల్లితెరపై కూడా అడుగు పెట్టింది.
ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న వర్ష తాజాగా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా వర్షానే లైవ్ ద్వారా తెలిపింది. `రెండు రోజుల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు. మరి అంత సీరియస్గా ఏమీ అనిపించలేదు కానీ కరోనా పరీక్షలు చేసుకున్నాను. అందులో పాజిటివ్ అని వచ్చింది.
ఈ విషయాన్ని లైవ్లోకి వచ్చి ఎందుకు చెప్పాలి అని అనుకున్నాను అంటే.. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. ఇక్కడ జరిగిందేది ఎవ్వరికీ తెలియదు.. చూస్తే భయపడతారు. చనిపోయిన వారిని అలా ప్యాక్ చేసి పడేస్తున్నారు. అది చూడగానే లైవ్లోకి వచ్చిచెప్పాలని అనుకున్నాను. అందరూ జాగ్రత్తగా ఉండండి` అని వర్ష తెలిపింది. కాగా, వర్షకు కరోనా సోకడంతో బుల్లితెర నటులు ఆందోళన చెందుతున్నారు.