ఈ బుల్లితెర జంట బ్రేకప్‌ చెప్పుకోనున్నారా?

ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో ఢీతో ఎంతో మంది డ్యాన్సర్లు తమ డాన్స్ స్టెప్స్ తో అలరించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. అందులో అక్సా ఖాన్ కూడా ఒకరు. ఢీ 10 కంటెస్టెంట్‌గా వచ్చిన అక్సా విన్నర్ కాలేనప్పటికి ఈ సీజన్‌కు ప్రత్యేకంగా నిలిచింది. అలాగే ఇదే షోలోని ఫుల్ క్రేజ్ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న మరో డ్యాన్సర్‌, బుల్లితెర మైకల్‌ జాక్సన్‌ పండు. అక్సాకు పండుకు మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఎందుకంటే పండును చాంపియన్స్ నుంచి ఎలిమినేట్ చేయడం అక్సాఖాన్‌ను తీవ్రంగా బాధించింది. దీనితో ఢీ ప్రేక్షకులు, అభిమానులు పండు, అక్సాలు ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రసుతం అక్సా ఆర్‌జీవీ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు పండు కూడా పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఫుల్‌ బిజీ అయిపోయాడు. వీరిమధ్య ఏవో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు సమాచారం. పండు తనను దూరం పెడుతున్నాడని అక్సా తన సన్నిహితులతో చెప్పి వాపోయిందట. దీంతో ఈ బుల్లితెర జంట తమ ప్రేమయాణానికి బ్రేకప్‌ చెప్పనున్నారు అంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి.