సినిమాటోగ్రాఫ‌ర్ పెళ్లి వేడుక‌లో సంద‌డి చేసిన నటి..!

ఇటు తెలుగుతో పాటు త‌మిళ హిట్ చిత్రాలకు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌ని చేశారు జీకే విష్ణు. విజ‌య్ న‌టించిన మెర్స‌ల్, బిగిల్ సినిమాలకు సినిమాటోగ్ర‌ఫీ అందించి్న విష్ణు టాలీవుడ్ సూప‌ర్ హిట్ చిత్రం క్రాక్‌కి కూడా వర్క్ చేశారు. క‌రోనా కారణంగా ఆయ‌న అతి కొద్దిమంది స‌న్నిహితులు, శ్రేయోబిలాషులు, బంధువుల సమ‌క్షంలో మ‌హా అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్ళికి సినీ ఇండ‌స్ట్రీ నుండి కీర్తి సురేష్‌, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ హాజ‌ర‌య్యారు.

పెళ్లి వేడుక‌లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్, కీర్తి సురేష్ క‌లిసి దిగిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫొటోల‌లో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు మాస్క్‌తో స‌రికొత్త లుక్‌లో కనిపించి మెప్పించారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చిన నాంది, క్రాక్ చిత్రాల‌లో విల‌క్ష‌ణ పాత్ర‌లు పోషించి తెలుగు ప్రేక్షకుల‌కి చాలా సుపరిచితం అయింది.