మ్యాచ్ ఆడుతుండగా మైదానంలో భారీ పేలుడు..14 మంది గాయాలు..!

ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్న టైములో పెద్ద బాంబు పేలడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయ పడ్డారు. బలూచిస్థాన్లో ఓ ఫుట్బాల్ గ్రౌండ్ లో బాంబు పేలుడు సంభవించింది. మ్యాచ్ జరుగుతున్న టైములో ఈ పేలుడు జరిగిన క్రమంలో 14మంది ప్రేక్షకులు కూడా తీవ్రంగా గాయ పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

 

కానీ , బలూచిస్థాన్లో ఫుట్బాల్ గ్రౌండ్ లో మ్యాచ్ లో ఉన్న ప్లేయర్స్ ఎవ్వరికి ప్రమాదం జరగలేదని, గ్రౌండ్ ప్రహారి పక్కన పేలుడు సంభవించటం వల్ల అక్కడ ఉన్న ప్రేక్షకులే గాయ పడినట్లు అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయ పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ బాంబు పేలిన ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు మొదలు పెట్టనున్నారు.