మంచు విష్ణుకు త‌ల‌నొప్పిగా మారిన ఐపీఎల్‌..కార‌ణం అదేన‌ట‌!

క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 ఇటీవ‌లె మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి జ‌ట్టు టైటిల్ గెలుచుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తూ.. ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంట‌ర్టైన్ చేస్తున్నారు. అయితే అంద‌రూ ఇష్ట‌ప‌డే ఐపీఎల్‌.. టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు మాత్రం పెద్ద త‌ల‌నొప్పిగా మారింద‌ట‌. అందుకు ఆయ‌న కూతుళ్లు అరియానా, వివియానానే కార‌ణమ‌ట‌.

Manchu Vishnu Biography, Age, Height, Bio data & Untold Stories - WikiBioPic

అరియానా ధోనీ ఫ్యాన్ అయితే, వివియానాకు విరాట్ ఫ్యాన్ అట‌. దీంతో ధోనీ, విరాట్‌ కెప్టెన్ల గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జ‌రిగిందంటే విష్ణు ఇంట్లో పెద్ద రచ్చే జరుగుతుందట. మా క్రికెటర్ గొప్పోడు అంటే మా క్రికెటర్ గొప్ప అని అరియానా, వివియానా తెగ గొడ‌వ‌ప‌డుతూ విష్ణుకు త‌ల‌నొప్పిగా మారార‌ట‌.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు విష్ణు. `అరి ధోనీ ఫ్యాన్. వివి కోహ్లీ ఫ్యాన్. ఈ ఇద్దరూ.. ధోనీ, కోహ్లీల‌లో గొప్ప ఎవరూ అని గొడవపడుతున్నారు. ఈ గొడవ కూడా మాములుగా కాదు. ప్లీజ్, ఈ విషయంలో మీరే సాయం చేయండి` అంటూ ట్వీట్ చేశాడు మంచు విష్ణు. దీంతో విష్ణు ట్వీట్ వైర‌ల్‌గా మారాఇంది.