నంద్యాల ఉప ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 19 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఓట్లను లెక్కించనున్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు చేశారు. అయితే పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో అభ్యర్థులకు ఉద్యోగులు షాక్ ఇచ్చారు. మొత్తం 250 ఓట్లలో 211 ఓట్లు ఎవ్వరికి ఓటయలేదు.
ఇక మిగిలిన 39 ఓట్లు చెల్లకుండా పోయాయి. నంద్యాలలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉద్యోగస్తులు భయాందోళనతోనే ఏ పార్టీకి ఓట్లు వేయకుండా ఇలా చేశారని పలువురు చెపుతున్నారు. టీడీపీకి ఓటేస్తే వైసీపీ వాళ్లతో ఇబ్బంది ఉంటుందని, వైసీపీకి ఓట్లేస్తే అధికారంలో ఉన్న టీడీపీ నుంచి ఇబ్బంది ఉంటుందనే ఓటర్లు ఇలా చేశారని టాక్.